విద్యను కాషాయకరణ చేస్తు, కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేరిట తీసుకువచ్చిన విద్యా సంస్కరణలు దేశ భవిష్యత్తు కు ప్రమాదకరంగా ఉన్నాయని దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పి డి ఎస్ యు) జిల్లా కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డి ,పి డి ఎస్ యు జిల్లా నాయకులు సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.* సోమవారం రోజున స్థానిక గోనెగండ్ల జడ్పీ హైస్కూల్ లో నందు పీడీఎస్ యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యను కాషాయకరణ దిశగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని,శాస్త్రీయ,లౌకిక,ప్రజాతంత్ర విద్యా విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కస్తూరి రంగన్ ఇచ్చిన నివేదిక ప్రజా ప్రయోజనాలకి వ్యతిరేకమని అన్నారు. కేంద్ర మంత్రివర్గం పార్లమెంటులో చర్చ లేకుండానే దీన్ని ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముఖ్యంగా విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఇందులో పేర్కొనక పోవడం దుర్మార్గమన్నారు. ధార్మిక సంస్థల పేరుతో ప్రైవేటు, రాజకీయ భావజాల సంస్థలకు ప్రభుత్వ నిధులను బదలాయింపు చేయడం ప్రభుత్వ ఉద్దేశమని విమర్శించారు.విశ్వవిద్యాలయాలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైన నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని (పి.డి.ఎస్.యూ ) విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.లేనిపక్షంలో దీనికి వ్యతిరేకంగా సభలు,సమావేశాలు నిర్వహించి ప్రగతిశీలవాదులు,మేధావులతో,వామపక్ష పార్టీలతో విద్యార్థి సంఘాలు లిసి ఉద్యమిస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నాయకులు రంగస్వామి, వేణు ,రంజిత్ ,తేజ ,పాండు పాల్గొన్నారు.