కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో సి.పి.ఐ, ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో బస్టాండు ముందర నీతికుంటగా ఉన్న రహదారి పై వరినారి వేసి నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎ.ఐ.యస్.ఎఫ్. మండల కార్యదర్శి రామాంజినేయులు, బి.కె.యం.యు. మండల కార్యదర్శి కుమ్మర చంద్రన్న, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలో చాలా వీధుల్లో రోడ్లన్నీ ఇలాగే బురద కుంట మాదిరిగా రోడ్లు చాలా ఉన్నాయి అన్నారు. నాయకులు, అధికారులు మాత్రం గ్రామంలో పర్యటిస్తున్నారు. కానీ పట్టించుకునే పాపాన పోలేదు, మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు.ఇప్పటికైనా మండల నాయకులు, అధికారులు మేలుకొని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తీర్చాలని అలాగే కల్లుకుంట గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలు గ్రామ పంచాయతీ సెక్రటరీకి విన్నవిస్తే నాకు తెలియదు, మీరే డబ్బులు పోగు చేసుకుని మీ గ్రామ అభివృద్ధి పనులు మీరే చేసుకోవాలని గ్రామస్తులకు చెబుతుండడం గమనార్హం, ఇలాంటి కల్లుకుంట గ్రామ పంచాయితీ కార్యదర్శిని, విధుల నుంచి తొలగించాలని అన్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు, వెంటనే కల్లుకుంట గ్రామ సమస్యలు పరిష్కరించాలని సి.పి.ఐ. పార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎద్దుల ఈరన్న, లాలు భాష, ఏకాంబరం పాల్గొనడం జరిగింది.