శ్రీశైలం జలాశయం వైపు కృష్ణమ్మ ఉదృతంగా వరపళ్ళు తొక్కుతోంది, ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణా రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు లక్షా 57వేలకు పైగా క్యూసెక్కుల వరద శ్రీశైలం డ్యామ్ వచ్చి చేరుతుంది, దీనితో జలాశయం లో 151 టీఎంసీల నీరు నిల్వ ఉండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40వేల259 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది. ఇలాగే వరద ప్రవాహం కొనసాగితే ఈ వారం లో జలాశయం నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.