ఆత్మకూరు మండలం సంజీవనగర్ తాండ గ్రామానికి చెందిన, సిద్దాపురం మాజీ ఎంపీటీసీ దేశావత్ గుండు నాయక్ (43) శనివారం తెల్లవారుఝామున 3 గంటలకు గుండెపోటుతో మరణించారు. మృతుడికి భార్య లక్ష్మీ బాయి, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. గుండునాయక్ మృతి గిరిజనులకు తీరనిలోటు అని, సంజీవనగర్ తండా వాసులకు ఇంటి పట్టాలు ఇవ్వడం, ప్రతి ఇంటికి ప్రతిరోజు ఫిల్టర్ వాటర్ అందించారని, గిరిజనుల సమస్య లపై నిరంతరం పోరాడే వ్యక్తి అని, గిరిజన ప్రజల హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్న గుండు నాయక్ మరణం గిరిజనులకు తీరనిలోటు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జవహర్ నాయక్,శివారెడ్డి, గిరిజన ఐక్య వేదిక నాయకులు రవినాయక్, శివశంకర్ నాయక్, హనుమంతు నాయక్, రాజా నాయక్, రవి నాయక్, బాల నాయక్, థావురు నాయక్, బాలు నాయక్, బాలాజీ నాయక్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.