ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నికి ఆహుతైన ప్రైవేటు బస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 09:31 AM

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ తెల్లవారుజామున దారుణం జరిగింది. విజయపుర నుంచి 32 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. నాలుగో నంబరు జాతీయ రహదారిపై జిల్లాలోని హరియూర్ తాలూకా కేఆర్ హళ్లి వద్ద ఈ  ప్రమాదం సంభవించింది. మృతుల్లో  ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే బస్సులో మంటలు చెలరేగినట్టు హరియూర్ ఎస్పీ రాధిక తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com