ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తగ్గిపోతే నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందొచ్చని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు. ఇలాంటి లక్షణాలున్న వారికి పరీక్షలు లేకుండానే ఆస్పత్రిలో చేర్చుకునిచికిత్స ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. కరోనా వైరస్కు సంబంధించిన మూడు ప్రధాన లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు కూడా అవసరంలేదన్నారు. నేరుగా ఆస్పత్రికి వెళ్తే చేర్చుకుంటారన్నారు. మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన అన్ని చర్యలు చేపట్టిందన్నారు.