ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. ప్రొఫెసర్‌ కాదు కీచకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 09, 2020, 01:54 PM

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. బాలికలు, మహిళలు, విద్యార్థినులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో విద్యార్థులపై టీచర్లు, ప్రొఫెసర్లు అత్యాచారం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఒకప్పుడు ఎంఫీల్ చేస్తోన్న ఓ అమ్మాయి వర్శిటీలోని ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక రిలేషన్‌షిప్ పెట్టుకొని ఆ తర్వాత ముఖం చాటేశాడని పేర్కొంది. పోలీసుల దగ్గరున్న స్టేట్‌మెంట్ ప్రకారం... 25 ఏళ్ల ఆ యువతికీ ప్రొఫెసర్‌కీ మధ్య 2018 మధ్య నుంచి 2020 మార్చి వరకూ వివాహేతర సంబంధం కొనసాగింది. ఆ ప్రొఫెసర్ చాలాసార్లు తనను అత్యాచారం చేశారని బాధితురాలు కంప్లైంట్‌లో తెలిపింది. ప్రతిసారీ త్వరలోనే పెళ్లి చేసుకుంటాని అబద్ధాలు చెప్పారని ఆరోపించింది. మార్చి 2020 తర్వాత కరోనా వల్ల లాక్ డౌన్ సాకుతో ఆ ప్రొఫెసర్ ఆమెను దూరం పెట్టాడు. దీంతో ఆమె మోసపోయినట్లు భావించి పోలీసులను ఆశ్రయించింది. కంప్లైంట్ ఆధారంగా ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేయనున్నారు. ఆరోపణలు నిజమని తేలితే చట్టపరంగా ముందుకెళ్తామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com