తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. బాలికలు, మహిళలు, విద్యార్థినులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. గతంలో విద్యార్థులపై టీచర్లు, ప్రొఫెసర్లు అత్యాచారం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా కోల్కతాలోని జాదవ్పూర్లో ఓ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..జాదవ్పూర్ యూనివర్శిటీలో ఒకప్పుడు ఎంఫీల్ చేస్తోన్న ఓ అమ్మాయి వర్శిటీలోని ఇంజినీరింగ్ ప్రొఫెసర్పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక రిలేషన్షిప్ పెట్టుకొని ఆ తర్వాత ముఖం చాటేశాడని పేర్కొంది. పోలీసుల దగ్గరున్న స్టేట్మెంట్ ప్రకారం... 25 ఏళ్ల ఆ యువతికీ ప్రొఫెసర్కీ మధ్య 2018 మధ్య నుంచి 2020 మార్చి వరకూ వివాహేతర సంబంధం కొనసాగింది. ఆ ప్రొఫెసర్ చాలాసార్లు తనను అత్యాచారం చేశారని బాధితురాలు కంప్లైంట్లో తెలిపింది. ప్రతిసారీ త్వరలోనే పెళ్లి చేసుకుంటాని అబద్ధాలు చెప్పారని ఆరోపించింది. మార్చి 2020 తర్వాత కరోనా వల్ల లాక్ డౌన్ సాకుతో ఆ ప్రొఫెసర్ ఆమెను దూరం పెట్టాడు. దీంతో ఆమె మోసపోయినట్లు భావించి పోలీసులను ఆశ్రయించింది. కంప్లైంట్ ఆధారంగా ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేయనున్నారు. ఆరోపణలు నిజమని తేలితే చట్టపరంగా ముందుకెళ్తామని పోలీసులు తెలిపారు.