కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మండల, పట్టణ టాస్క్ఫోర్స్ అధికారులు నిర్ణయించిన మేరకు శనివారం, ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు శుక్రవారం కోరారు. పట్టణంలోని అంగళ్లు, షాపులు, మటన్ షాప్ లు, చికెన్ షాప్ లు, ఫ్యాక్టరీలు, లోడింగ్ అన్లోడింగ్ లను నిలిపివేసి సంపూర్ణ లాక్ డౌన్ కు వారంలో రెండు రోజులపాటు అందరూ సహకరించాలని కమిషనర్ కోరారు.