కరోనా నేపథ్యంలో పబ్లిసిటీ కోసం తినే పదార్థాలనే ‘కరోనా’ రూపంలో తయారు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఓ బేకరీలో కరోనా రూపంలో స్వీట్లు తయారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్లో జోద్పూర్లోని ఓ రెస్టారెంటులో ఏకంగా కోవిడ్ స్పెషల్ కర్రీలు తయారు చేసి అమ్మేస్తున్నారు. మలాయ్ కోఫ్తాలను కరోనా వైరస్ రూపంలో మలిచి కర్రీలుగా వడ్డిస్తున్నారు. అంతేకాదు నాన్, చపాతీలను సైతం మాస్కుల రూపంలో తయారు చేస్తున్నారు. ‘కోవిడ్ థీమ్’తో వడ్డిస్తున్న ఈ వంటకాలను తినేందుకు వినియోగదారులు కూడా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం కరోనా వంటకాల ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా చక్కర్లు కొడుతున్నాయి.