తమిళనాడులోని డి.శివన్ పోస్టల్ శాఖలో 30 ఏళ్లుగా పోస్టుమ్యాన్గా ఉద్యోగం చేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ చేశాడు. అతడు పోస్టల్ శాఖలో పోస్టుమ్యాన్గా చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చెందేవరకు దాదాపు 30 ఏళ్ల పాటు దట్టమైన అడవి ప్రాంతంలో రోజూ ఏనుగులు, ఎలుగుబంట్లను దాటుకుంటూ జారే ప్రవాహాలు, జలపాతాలను అధిగమించి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉత్తరాలు, పెన్షన్ సొమ్ము పంచి వచ్చేవాడు. శివన్ ఎక్కువగా నీలగిరి పర్వతాలు, రైల్వే ట్రాక్ల వెంట నడుస్తూ వెళ్లి వచ్చేవాడు. కూనూర్ సమీపంలోని హిల్గ్రోవ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రెక్కింగ్ సమీప ప్రాంతాల్లో నివసించే తోటల కార్మికులకు ఉత్తరాలు, పెన్షన్లు పంపిణీ చేసేందుకు పోస్టుమ్యాన్ శివన్ వెళ్లాల్సి వచ్చేది. రిమోట్ ప్రాంతాల్లో పనిచేస్తుండడంతో సొరంగాలు, అటవీ ప్రాంతాల మీదుగా నడిచేవారు. ఈ క్రమంలోనే తరచూ అడవి జంతువులను శివన్ ఎదుర్కొనేవాడు. ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు సదరు పోస్టుమ్యాన్ సేవలను ప్రశంసించారు.