కరోనా వైరస్ నేపథ్యంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. చాలామంది వంటింటి చిట్కాలు పాటిస్తుండగా మరికొందరు పండ్లు, కూరగాయల ద్వారా శరీరానికి రోగ నిరోధక శక్తి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనాసపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
-> అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు.
-> అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
-> సంతాన సమస్యలతో బాధపడేవారు అనాస తినడం ఎంతో మంచిది.
-> అనాసలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది.
-> కడుపు నిండా భోజనం చేసిన తర్వాత చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది.
-> అనాస పండును ముక్కలుగా చేసి, తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు.. మేని ఛాయ కూడా నిగారింపు కూడా వస్తుంది.
-> ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఒక గ్లాసు అనాస జ్యూస్ తాగండి.
-> అనాస రసాన్ని ఒక ఔన్సు మోతాదులో రోజుకి నాలుగుసార్లు తీసుకున్నట్లయితే నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
-> గొంతు నొప్పి, నోటిలో పుండ్లు ఉన్నట్లయితే.. అనాసరసాన్ని నోటిలో కాసేపు ఉంచుకుని మింగేయండి. తప్పకుండా అవి తొలగిపోతాయి.
-> అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం.
-> అనాస కాలేయానికి, మూత్రపిండాల సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
-> అనాసలోని కాపర్ శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలను వృద్ధి చేయడానికి సహాయపడుతుంది.
-> అనాసపండులోని మాంగనీస్ ఎముకలు, దంతాలు, కండరాలు, జుట్టు సమస్యలను నివారిస్తుంది.