ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత రేషన్ లభించని వారు ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయండి!

national |  Suryaa Desk  | Published : Fri, Jul 10, 2020, 04:10 PM

కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద 81 కోట్ల మందికి పైగా ఉచితంగానే రేషన్ సరుకులు అందిస్తోంది. నవంబర్ వరకు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు కూడా ఉచితంగానే రేషన్ పొందొచ్చు. అయితే రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు కానీ ఆధార్ కార్డు మాత్రం కలిగి ఉండాలి.గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద పింక్, యెల్లో, ఖాకీ రేషన్ కార్డులు కలిగిన వారు ఒక్కో మెంబర్‌కు 5 కేజీల గోధుమలు లేదా బియ్యం, ఒక కేజీ పప్పుదినుసులు ఉచితంగా పొందొచ్చు. మీరు ఒకవేళ ఉచిత రేషన్ పొందలేకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేయొచ్చు.ఉచిత రేషన్ లభించని వారు జిల్లా పౌరసరఫరాల కంట్రోలర్స్ ఆఫీస్ లేదా స్టేట్ కన్సూమర్ అసిస్టెంట్ సెంటర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే 1800 180 2087, 1800 212 5512, 1967 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. చాలా రాష్ట్రాలు దీనికి సంబంధించి ప్రత్యేకమైన హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com