అంగారకుడిపై జీవుల ఉనికిని తెలుసుకోడానికి ఎన్నాళ్ల నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూరిపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కు కీలకమైన ఆధారాలు దొరికాయి. ఆ గ్రహం మీద ఉన్న ఓ బిలం మొత్తం మంచుతో కప్పి ఉంది. దాని చుట్టూ ఎర్ర మట్టి ఉంది. దీన్ని దగ్గర నుంచి చూస్తే భూమిని చూస్తున్నట్లుగానే ఉంది. ఆ బిలంలో ఉన్నది కేవలం మంచు కాదని, గడ్డ కట్టి ఉన్న నీరని పరిశోధకులు స్పష్టం చేశారు.నార్త్ లోల్యాండ్ ప్రాంతంలో ఉన్న బిలం వెడల్పు 82 కిమీలు ఉన్నట్లు అంచనా వేశారు. దీనిపై ఏడాది మొత్తం 1.8 కిమీల మందంతో ఉండే నీరు గడ్డ కట్టి ఉంటుందని పేర్కొన్నారు. అక్కడ నీటి జాడలు ఉన్నాయంటే తప్పకుండా అక్కడ జీవం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. సోవియెట్ ర్యాకెట్ ఇంజినీర్, రష్యా స్పేస్ టెక్నాలజీ పితామహుడు సెర్గీ పావ్లోవిచ్ కొరోలెవ్కు గుర్తుగా ఈ బిలానికి ‘కోరోలెవ్ క్రేటర్’ అని పేరు పెట్టారు.