వ్యర్థంగా పాడేసే ప్లాస్టిక్ బాటిళ్లు..ఇప్పుడు అద్భుతమైన బొమ్మలా సాక్షాత్కరిస్తున్నాయి. ఆర్కే బీచ్లో పర్యాటకుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు పర్యవరణానికి కలిగించే హాని, రిసైక్లింగ్ తదితర విషయాలపై అవగాహన కలిగిచేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఏర్పాటు చేసింది. ‘ప్రపంచంలో కేవలం 10 శాతం నీటి బాటిళ్లను మాత్రమే రిసైకిలింగ్ చేస్తున్నారు. మిగతా 90 శాతం బాటిళ్లను బయటే పడేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ప్రమాదం పొంచివుంది’ అనే బోర్డును ఇక్కడ ఏర్పాటు చేశారు.