రెండో ఏడాది వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో భాగంగా సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్లున్న డ్రైవర్లకు ఏపీ సర్కార్ నేడు ఆన్ లైన్ ద్వారా అకౌంట్లో రూ.10 వేల చొప్పున జమ చేయనుంది. దీంతో కరోనా కష్టకాలంలో వారికి ఆర్ధికంగా వెసులుబాటు కలగనుంది. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 37,756 మంది దరఖాస్తు చేసుకున్నారు. క్రిందటి ఏడాది లబ్ది పొందిన 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేడు డబ్బులు జమ కానున్నాయి. మొత్తం 2,62,493 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్లో ఇవ్వాల్సి ఉన్నా కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.