ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారికి కేవలం 5 రోజుల్లోనే రేషన్ కార్డు అందించేలా సరికొత్త విధానాన్ని సర్కార్ తీసుకురానుంది. గ్రామ,వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకుంటే అర్హులకు రేషన్ కార్డులను అందించనున్నారు. దీని ద్వారా పేదలకు లాభం జరగనుంది. రేషన్ డెలివరీలో భాగంగా త్వరలోనే ప్రభుత్వం ఉచితంగా రేషన్ కార్డుదారులకు బియ్యం సంచులను అందజేయనుంది.