ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ 1 న విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 23, 2020, 12:46 PM

కేంద్ర విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఎసి శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. విద్యుత్ సంస్థల వద్ద నిరసన చేపట్టిన జేఎసి నాయకులు బడా పారిశ్రామికవేత్తల కోసమే విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జూన్ 1న దేశ వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని విద్యుత్ జేఎసి నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్ సవరణ బిల్లుతో రైతులకు ఉచిత కరెంట్ ఉండదని, ఎస్సీ, ఎస్టీ, బిసిలకు విద్యుత్‌లో ఇచ్చే రాయితీలు కోల్పోయే అవకాశం ఉందని జేఎసి నాయకులు ఆరోపించారు. కేంద్రం తీసు కొచ్చే విద్యుత్ సంస్కరణలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని, వన్ నేషన్ వన్ గ్రిడ్ తీసుకురావడంతో రాష్ట్రాలు నష్టపో తాయని, విద్యుత్ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవదని, సిఎం కెసిఆర్ ఇప్పటికే విద్యుత్ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకమని చెప్పినట్లు విద్యుత్ జేఎసి నాయకులు గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com