-కోడెల వ్యాఖ్యలపై మహిళా సంఘాల ఆగ్రహం
-పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డ కోడెల
-మహిళలంటే ఎంతో గౌరవం: కోడెల
హైదరాబాద్, సూర్యప్రతినిధి : మహిళా సదస్సు సందర్భంగా కొందరు నాపై పనిగట్టుకుని దుష్ప్ర చారం చేశారని, నా మాటలను వక్రీకరించడం బాధాకర మని స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఆవే దన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన వ్యాఖ్య లపై స్పందించారు. మహిళలు వంటింటికే పరిమి తమైతే వేధింపు లుండవు. కానీ మహిళలు ఉద్యో గాలు, వ్యాపారాలు అంటూ బయట తిరుగు తు న్నందువల్లే వేధింపులకు గురవుతున్నారు. మిహ ళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలతో పాటు బాల్య వివాహాలు, అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టాలంటే చట్టాలు ఒక్కటే ఉంటే సరి పోవు. ఆ చట్టాలు అమలు కావాలంటే మహిళల్లో ధైర్యం రావాలి అని మహిళా పార్లమెంట్లో స్పీకర్ కోడెల వ్యాఖ్యానించారు. ఈవ్యాఖ్యలపై ప్రతిపక్షా లు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.