ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ వంతు సాయమందించింది. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లోని సభ్యులు తమ మూడు రోజుల వేతనాన్ని కోవిడ్-19 సహాయచర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ విషయాన్ని జగన్ కు తెలియజేస్తూ, సంబంధిత పత్రాన్ని ఆయనకు అందజేశారు.