దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో శనివారం నుంచి మధ్యప్రదేశ్లో మద్యం షాపులు మూతపడనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. 21 రోజుల లాక్ డౌన్ సందర్బంగా శనివారం నుంచి మధ్యప్రదేశ్లో మద్యం షాపులు తెరవరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లఘించి మద్యం షాపులు తెరిస్తే కఠిన చర్యలుంటాయని సీఎం పేర్కొన్నారు.