ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుస భూప్రకంపనలతో అల్లాడిన చంబా జిల్లా

national |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2020, 01:21 PM

దేశమంతా ఓ వైపు కరోనాతో అతలాకుతలమవుతుంటే మరోవైపు భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో 3 నుంచి 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. శుక్రవారం సాయంత్రం 5.11 గంటలకు మొదటి ప్రకంపన నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 5.11 నుంచి రాత్రి 8.43 గంటల మధ్య ప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 5.11 గంటలకు భూకంప తీవ్రత 3.6 గా నమోదైందని, తరువాత 5.17 గంటలకు 4.3 తీవ్రతతో, తిరిగి 5.45 గంటలకు 3 తీవ్రతతో, అనంతరం 6.49 గంటలకు 3.8 తీవ్రతతో, రాత్రి 8.43 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com