టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు
తిరుపతి, మేజర్న్యూస్ : శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు దర్శనం, బస, లడ్డూ ప్రసాదం తదితర సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు ఆధార్ కార్డును వినియోగించడంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్ శ్రీనివాస రాజు అధికారులను ఆదేశించారు. తిరు మలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం పలు అభివౄఎద్ధి పనులపై అధికారులతో సుదీర్ఘం గా సమీక్షించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు త్వరలో పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపారు. టిటిడి ఈవో ఆదేశాలమేరకు ఇప్పటికే కొన్ని సంస్కరణలు తీసుకువచ్చామని, ఇందులోభాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని కంపార ్టమెంట్లలో శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి సూచనలు, సలహాలు, ఫిర్యా దులను స్వీకరిస్తున్నామని, చంటి పిల్లలకు పాలు అందిస్తున్నామని వివరిం చారు. భక్తుల అభిప్రాయాలను ప్రతిరోజు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కంపార్టమెంట్లలో త్వరలో హెల్పడెస్కలు ఏర్పాటు చేసి, భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు వీలుగా శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో టిటిడి ఎస్ఈ 2 శ్రీ రామచందర్రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో కోదండ రామా రావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీమతి చెంచులక్ష్మీ, విజీవోలు రవీందర్రెడ్డి, శ్రీమతి విమలాకుమారి తదితరులు పాల్గొన్నారు.