ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సర్కార్ దూకుడు..రహస్య అన్వేషణ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 12:37 PM

ఏపీ సర్కార్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు మండలిలో ఆగిపోయింది. అయినా ఏపీ సర్కార్ దూకుడుతో వ్యవహరిస్తుంది. కార్యనిర్వాహక రాజధాని విశాఖలో ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోమవారం సీఎం జగన్ విజయనగరంలో ఉండగా ప్రభుత్వం అధికారులు, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో రహస్య పర్యటన జరిపారు. పరిపాలనకు సంబంధించిన భవనాల కోసం వారు అన్వేశించారు.
రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన సాగే దిశగా వారు పర్యటన జరిపినట్టు తెలుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, జీఏడీ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్ విశాఖలో పర్యటించారు. స్థానికంగా ఉన్న నేతలకు, ముఖ్య అధికారులకు కూడా ఈ విషయం తెలియదట. సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు వారు విశాఖలోనే పర్యటించారు. దీంతో జగన్ సర్కార్ రాజధాని తరలింపుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తునట్టు చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com