తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వా డిగుండం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . మహారాష్ట్రకు చెందిన భక్తుల ఇండిగో కారు అదుపు తప్పి మాల్వాడిగుండం వద్ద బోల్తా కొట్టింది . ఇందులో ఐదుగురు ప్రయాణిస్తుండగా అదృష్ట వశాత్తు ఇద్దరు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు . టీటీడీ సిబ్బంది వాహనాలను తొలగించి ట్రాఫికను క్రమబద్ధీకరించారు .