పరారీలో ఉన్న నీరవ్ మోడీకి చెందిన మరిన్ని వస్తువులను ఆన్లైన్ వేదికగా మరోసారి వేలం వేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. గత నెల్లో ముంబైలో కొన్ని వస్తువులను ఈడీ వేలం వేసింది. ఈసారి స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ పేరిట ముంబైలో ఫిబ్రవరి 27, స్ప్రింగ్ ఆన్లైన్ ఆక్షన్ పేరుతో మార్చి 3, 4 తేదీల్లో మొత్తం 112 సీజ్ చేసిన వస్తువులను వేలంలో ఉంచాలని నిర్ణయించిం ది. ఈ వస్తువులలో ప్రత్యేకమైన కళఖండాలు ఉన్నాయి. ఆధునిక, సమకాలీన భారతీయ కళల పెయింటింగ్స్, లగ్జరీ వాచీలు, హ్యాండ్ బ్యాగ్స్లు, కార్లు వేలంలో ఉండనున్నాయి. స్ప్రింగ్ లైవ్ ఆక్షన్లో మొత్తం 40 లాట్స్ ఉంటా ³యి. ఇందులో 15 కళలకు సంబంధిం చినవే. ఇందులో 1935 నాటి కళాఖండం ఉంది. ఈ పెయింటింగ్ను 20 శతాబ్దపు ప్రముఖ భారతీయ ఆర్టిస్ట్ అమృతా షేర్గిల్ వేశారు. బాయ్స్ విత్ లెమన్స్ పెయింటింగ్కు పేరు పెట్టారు. ఈ పెయింటింగ్ విలువ రూ.12-18 కోట్ల మధ్య పలుకుతుందనే అంచనాలున్నాయి. ఈ పెయింటింగ్ ఆక్షన్ మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారి. విలువైన పెయింటింగ్స్లో 1972 నాటి బ్యాటిల్ ఆఫ్ గంగా అండ్ జమునా పెయింటింగ్ మరొకటి. ఈ వేలంలో పాత పెయింటింగ్స్తోపాటు లగ్జరీ వాచీలు, కార్లు అందుబాటులో ఉంటాయని ఈడీ వెల్లడించింది.