రాష్ట్రంలోని తిరుప్పూర్ సమీపంలోని అవినాషి వద్ద తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిర్పూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. యాక్సిడెంట్లో 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అంబులెన్స్లను రప్పించి, క్షతగాత్రులను తిరుప్పూర్, కోయంబత్తూర్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.