ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27 ఏళ్ల తర్వాత ఆసియా రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణం

national |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 01:39 PM

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మల్లయోధుడు సునీల్‌ కుమార్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. గ్రీకో రోమన్‌ 87 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సునీల్‌.. 27 ఏళ్ల తర్వాత ఈ కేటగిరిలో పసిడి గెలిచిన భారత రెజ్లర్‌గా నిలిచాడు. 1993లో చివరిగా పప్పూ యాదవ్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్‌లో స్వర్ణం గెలిచాడు. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సునీల్‌ 5-0తో అజత్‌ సలిదినోవ్‌ (కిర్గిస్థాన్‌)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్‌లో ఈ భారత రెజ్లర్‌ 11-8తో అజ్మత్‌ (కజకిస్థాన్‌)పై విజయం సాధించాడు. ఒక దశలో 1-8తో వెనకబడిన అతను వరుసగా 11 పాయింట్లు సాధించి నెగ్గడం విశేషం. ఇదే టోర్నీలో మరో భారత రెజ్లర్‌ అర్జున్‌ (55 కేజీలు) కాంస్యం గెలిచాడు. కాంస్య పతక పోరులో అర్జున్‌ 7-2తో నాసర్‌పోర్‌ (ఇరాన్‌)ను ఓడించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com