పోలీసు విచారణలో లాయర్ల భాగస్వామ్యం కానున్నారు. ప్రాసిక్యూషన్ లో న్యాయవాదులకు భాగస్వామ్యం కల్పిస్తూ నిర్ణయించింది. ఈ నియామకం కోసం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఫలితాలను హోంమంత్రి సుచరిత, డిజిపి సవాంగ్ విడుదల చేశారు. ఈ సందర్బంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ఏపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల చేశాం అని అన్నారు. 50 మంది అభ్యర్థులను ఏపీపీ పోస్టులకు రిక్రూట్ చేశామని అన్నారు. 50 శాతం మహిళలు కూడా ఏపీపీ పోస్టులకు ఎంపికైయ్యారని అన్నారు. వేకెన్సీ రిజర్వులో ఉన్నవారికి జీతం ఇవ్వబోమన్నది అవాస్తవం అని డిజిపి అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబందించిన అంశాన్ని కేంద్రానికి నివేదించామని అయన తెలిపారు. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు అంశం కోర్టులో ఉంది.