భోపాల్ రైల్వేస్టేషన్ లో పుట్ ఓవర్ బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే అధికారి మాట్లాడుతూ... ఫుట్ఓవర్ బిడ్జి స్లాబ్లో కొంత భాగం కూలిపోయిందని అన్నారు. ఈ ఘటనలో 6 మంది గాయపడ్డారని అన్నారు. వారికీ తీవ్రమైన గాయాలు ఏమి లేవని అన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని, దీనికి బాధ్యత వహించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.