విజయవాడ: వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలోనూ అదే తేలిందని ఆయన చెప్పారు. 67 శాతం మంది వ్యతిరేకించినా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. మూడు రాజధానులను ఆమోదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. 7840 మంది తమ అభిప్రాయాలు చెప్పగా అందులో 67 శాతం మంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని తీర్పునిచ్చారు. కేవలం 29శాతం మంది మాత్రమే రాజధానుల వికేంద్రీకరణ సరైందని చెప్పారు. ఇక 4 శాతం మంది తటస్థమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు