అమరావతి:నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలపై నేటి సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. జరిగిన సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా విశాఖపట్నం ఖరారైంది. హైకోర్టు కర్నూలుకు తరలిపోనుంది. శాసన రాజధానిగానే అమరావతి పరిమితం కానుంది. అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా. జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు...