వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. రద్దీ దృష్ట్యా రేపటి నుంచి 7 వరకు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నాని అయన తెలిపారు. విశాఖలో శ్రీవారి ఆలయ నిర్మాణ వ్యయం రూ. 23 కోట్లకు పెంచారు. ఏప్రిల్ లో ఆలయాన్ని ప్రారంభిస్తాం. గతఏడాది 2.78 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 12.49 కోట్ల లడ్డులను విక్రయించాము. రూ. 1,161.74 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు అయన తెలిపారు.