దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలో దిల్లీలోని పలు పాంతాల్లో ఆందోళనకారులు నిరసన చేపట్టారు. కొందరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసం ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ భీమ్ ఆర్మీ కార్యకర్తలు సహా వందలాది మంది నిరసనకారులు తమ చేతులు కట్టేసుకుని ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జోర్బాగ్ నుంచి లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసం వైపు బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు.ఆందోళల దృష్ట్యా లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్ గేట్లను అధికారులు మూసివేశారు.