(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : వేసవిలో ఉపాధి హామీ పథకం పనుల ద్వారా పేదలకు ఉపాధి కల్పన తోపాటు గ్రామాలు పరిశుభ్రమౌతున్నాయని ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సత్తెనపల్లి, ముపాళ్ళ మండల పరిషత్ కార్యాలయల్లో నియోజక వర్గంలోని ఉపాధి వేతనదారులకు పలుగు, పార, పట్టా, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. ఉపాధి హామీ పనుల ద్వారా రోడ్లు, పంపకాలువలు, ఇంకుడు గుంతలు, చెరువులు, స్మశానవాటి కలు, బావులు అభివద్ధి చేయవచ్చన్నారు. ఉపాధి నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మూడు సంవత్సరాలుగా నియోజకవర్గంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సహకారంతో ఇంకుడు గుంతలు, పంటకుంటల ద్వారా నీటి వనరులను,పంటలను ఏవిధంగా కాపాడుకుంది ప్రజలు వివరించారు. ఆయన మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని స్మశానవాటికల ఫోటోలు మంత్రి నారా లోకేష్ చూసి వీటిని అమెరికాలో చూపించి ప్రచారం నిర్వహిస్తామని తీసుకెళ్లినట్లు తెలిపారు. మిర్చి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం కేవలం గుంటూరు యార్డు లో మ్త్రామే కలిపిస్తున్నారని దీంతో ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. స్పందించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు మార్కెటింగ్ కమిషనర్ మల్లికార్జునరావు గారితో మాట్లాడి ఇక్కడ కూడా సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో రైతులు ఆనందోత్సాహాలతో హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో గతంలో మంజూరైన ఇళ్లు కాక కొత్త గా 2200మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని ఎవ్వరైనా కులాలు, మతాలు, పార్టీ లతో సంబంధం లేకుండా అవసరమైన అందరికీ గ హలు మంజూరు చేయాలని అధికారులను, నాయకులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పేదలకు వరమని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. నరసరావుపేట లోని టౌన్ పంక్షన్ హల్లో నియోజకవర్గ ఉపాధి హమి వేతన దారులకూ పలుగు, పార, పట్టలను పంపిణీ చేశారు. ఇంకుడు గుంతలు, ఉపాధి హమీ వేతనాలు ఆలస్యం అవుతుండడంపై డ్వామా పీడి శ్రీనివాస్ ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లడతానని వెంటనే అవి విడుదల ఆధేశించారు.