అమరావతి : అమరావతిని క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా ఉండాలని చంద్రబాబు అన్నారు. స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పారదర్శకత కోసం స్విస్ చాలెంజ్ పద్ధతిని తీసుకువచ్చామన్నారు. స్టార్టప్ ఏరియాకు లక్షాపాతిక వేల కుటుంబాలు వస్తాయన్నారు.