గవర్నమెంట్ కోర్ శంకుస్థాపనకు విస్తృత ఏర్పాట్లు
(వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : ఇప్పటికే రెండు, మూడు దఫాలు శంకుస్థాపన జరగనున్న ఉద్దండ్రాయునిపాలెం, తాళ్ళాయపా లెం తదితర ప్రదేశాలను పరిశీలించి అధికారు లకు సూచనలు ఇచ్చారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కతిక శుక్ల కూడా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సింగపూర్ కన్షార్షియం సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్న దష్ట్యా ఏర్పాట్లలో ఎక్కడా లోపం లేకుండా చూడాలని జిల్లా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఏర్పా ట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచ నలుచేశారు. ఐజీ సంజయ్, గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణనాయక్, అమరావతి రాజధాని ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆర్డీవో బండ్ల శ్రీనివాస రావు, సీఆర్డీఏ అధికారులతో కలెక్టర్ ఏర్పా ట్లపై చర్చించారు. జాయింట్ కలెక్టర్ కతిక శుక్ల వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఎవరె వరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలనేది వివరించా రు. రెండు, మూడు హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని డీఎంహెచవోను ఆదేశిం చారు. ఆ రోజంతా రాజధానిలో విద్యుత్ సరఫ రాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాల న్నారు. పోలీసుశాఖ తగిన
బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని గవర్నమెంట్ కోర్ శంకుస్థాపన కార్యక్రమంపై దృష్టి పెట్టేలా చేస్తున్నారు. గవర్నమెంట్ కోర్ ఏరియా అమరావతి రాజధానిలో కీలక ప్రదేశం. ఇక్కడ ఒక వైపున అసెంబ్లీ, మరోవైపున సచివాలయం, ఇంకో వైపున హైకోర్టు భవనాలు ఉంటాయి. వీటితో పాటు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ శాఖల హెచ్వోడీలు, కమిషనరేట్లు నిర్మిస్తారు. సుమారు 6 లక్షల మంది ప్రజలు నివసించేందుకు వీలుగా హౌసింగ్ కార్యక్రమాలు కూడా చేపడతారు. ఉన్నతస్థాయి అధికారుల నివాసాలు కూడా గవర్నమెంట్ కోర్ ఏరియాలోనే ఉంటాయి. రివర్ఫ్రంట్, పచ్చదనంకు అధిక ప్రాధాన్యం కల్పిస్తారు. ప్రభుత్వ కార్యకలాపాలను సమీపంలో నుంచి చూసేందుకు వీలుగా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అమరావతి రాజధాని మాష్టర్ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ గవర్నమెంట్ కోర్ ఏరియాలో భాగాస్వామ్యం కావాలని నిర్ణయించింది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిన సింగపూర్ కన్షార్షియం సంస్థ బిడ్డింగ్లో పాల్గొన్నది. మధ్యలో కొన్ని న్యాయపరమైన అవాంతరాలు ఎదురుకాగా అవన్నీ తొలగిపోవడంతో ఆ సంస్థతో ఒప్పందం కుదర్చుకొని అదేరోజున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని ముఖఁమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విజయవాడలోనే గేట్వే హోటల్లో ఎంవోయూ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఏర్పాటు చేశారు. అనంతరం హెలికాఫ్టర్లలో సీఎంతో పాటు సింగపూర్ బృందం సభ్యులు నేరుగా శంకుస్థాపన జరిగే తాళ్ళాయపాలెంకు చేరుకొంటారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాజధాని ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 10 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.