విశాఖపట్నం : రాగల 48గంటల్లో కోస్తాలో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. రాజమహేంద్రవరంలో 37, విజయవాడలో 36డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరాడలో 8, కడపలో 6సెం.మీ. వర్షపాతం నమోదైంది.బుధవారం అధిక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.