విశాఖపట్నం : శ్రీలంక ఎయిర్లైన్స్ విశాఖ నుంచి శ్రీలంకకు జులై 8 నుంచి విమాన సేవలను ప్రారంభించనుందని రాష్ర్ట టూర్స్, ట్రావెల్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఒ.నరేష్కుమార్ విశాఖలో తెలిపారు. టూర్స్ అండ్గట్రావెల్స్ అసోసియేషన్, వ్కెజాగ్ అభివద్ధి మండలి కలిసి విమాన సేవల వివరాలను వెల్లడించారు. శ్రీలంక విమానయాన సంస్థ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విశాఖ నుంచి వారంలో నాలుగు రోజులు కొలంబోకు విమానం నడపనుంది. కొలంబోలో ఈ విమానం ఉదయం 7.10 గంటలకు బయలు దేరి 9.10 గంటలకు విశాఖ చేరుతుంది. తిరిగి విశాఖలో ఉదయం 10.10 గంటలకు పయనమై కొలంబోకు 12.15 నిమిషాలకు చేరుతుందని నరేష్కుమార్ తెలిపారు. మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఈ విమానం పయనిస్తుంది. టిక్కెట్ల విక్రయం ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. విశాఖ నుంచి వివిధ దేశాలకు విమాన టిక్కెట్ల ధరల్లో శ్రీలంక ఎయిర్లైన్స్ 20 శాతం రాయితీ కూడా ప్రకటించిందన్నారు. ఎ320, ఎ.321 రకం ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ను శ్రీలంక ఎయిర్లైన్స్ ఈ సేవల కోసం ప్రారంభిస్తుందన్నారు. విశాఖ నుంచి శ్రీలంక మీదుగా బీజింగ్, షాంఘై, టోక్యో, లండన్, హాంకాంగ్, జకార్తా, మాల్దీవులు, సేచెల్లెస్, దుబాయి, బహ్రెయిన్, మస్కట్ష, అబుదాబి, దోహ, రియాద్, జెడ్డా తదితర దేశాలకు రాయితీ ధరలపై ప్రయాణించవచ్చన్నారు. ఈ దేశాలకు బోర్డింగ్ పాస్ జారీ, బ్యాగేజీ చెకింగ్ విశాఖలోనే జరుగుతాయన్నారు. ఈ ప్రయాణ సమయంలో శ్రీలంకలో ఆగి 8 నుంచి 24 గంటల సేపు పర్యటించే అవకాశం కూడా శ్రీలంక ఎయిర్లైన్స్ కల్పిస్తోంది. సమావేశంలో సంఘం అధ్యక్షులు విజయ్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.