గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పురుగుల మందు తాగి వివాహిత మహిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడికొండ మండలం లచ్చన్నగుడిపూడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎ. రాజేశ్వరి (35) భర్త మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కొంత కాలంగా తల్లి వద్ద నివసిస్తుంది. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి వచ్చిన ఆమె రాత్రి 2:30 గంటల సమయంలో పురుగుమందు ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జీజీహెచ్ కు తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. విచారణలో ఆత్మహత్యకు కారణాలు తెలుస్తుందని చెప్పారు.