కాలుష్య నియంత్రణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విశాఖలో జరిగిన ఐఐపీఈ వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. కాలుష్యం మానవాళిని మొత్తం నాశనం చేస్తోందని పేర్కొన్నారు. కాలుష్యరహిత వినియోగం దిశగా వసతులు పెరగాలన్నారు. దేశమంతా పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలతో ఐఐపీఈ ఒప్పందం అభినందనీయమన్నారు.