అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం మూడు మృతదేహాలు హిందూపురం. దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో చెల్లాచెదురుగా పడిఉన్నాయి. స్థానిక వివరాల మేరకు.. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో రైల్వే పట్టాలపై ఈ రోజు ఉదయం మూడు మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు మఅతదేహాలలో ఒక మఅతదేహం మహిళదిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక.. ఎవరైనా హత్య చేసి పట్టాలపై పారేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ మఅతదేహాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు ఆమె హత్య చేయబడినట్లు భావించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. రంగంలోకి దిగిన వన్ టౌన్, టూ టౌన్ రూరల్ సిఐ లు సమగ్రంగా పరిశీలించి పోలీసు జాగిలాల ద్వారా దర్యాప్తును ప్రారంభించారు. మరో వైపు.. మణుగూరు రైల్వే స్టేషన్ సమీపంలో వఅద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కూడా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.