ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నెల్లూరు కాకుటూరులో సీఎం జగన్ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్న సందర్భంగా సీఎం జగన్ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అర్హులైన రైతులకు రైతు భరోసా చెక్కులను పంపిణీ చేయనున్నారు.