తనను చేసుకుంటానని చెప్పి నాలుగు సంవత్సరాలుగా తనపై లైంగిక వాంఛ తీర్చుకున్నాడని ఆరోపణలు చేసిన మహిళ నే ఓ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పెళ్లి చేసుకున్న ఘటన లక్నోలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లా హాపూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా పని చేస్తున్న దినేష్ కుమార్ అనే వ్యక్తిపై ఓ మహిళ కొద్ది రోజులుగా లైంగిక ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మీడియా ముందుకు వచ్చింది. దీంతో రచ్చ రచ్చగా మారటంతో ఆ న్యాయ మూర్తి అసలు ఆమెతో తనకు సంబంధమే లేదని ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. అయితే వీరిరువురి రిలేషన్షిప్ గురించి వేరే ఎవరికీ తెలియదని ఈ విషయమై పరిశీలించిన ఖుషినగర్ జిల్లా మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ సింగ్ తెలిపారు. కానీ శుక్రవారం సాయంత్రం ఖుషినగర్లోని గాయత్రి గుడిలో వీరి వివాహం జరిగినట్లు ఓ జిల్లా స్థాయి అధికారి మీడియాకు వివరిస్తూ ఓ ఫోటో విడుదల చేసారు.