ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి, సోంపేట, మందస, పలాస.. కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు.. అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు, నల్లచెరువు, తలుపుల, కదిరి, గాండ్లపెంట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.