శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో శనివారం టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఒడిశా ప్రభుత్వ కళాకారుల బృందం ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శించింది.
అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశాఖపట్నంకు చెందిన జాగర్లపూడి మాధవికృష్ణ భక్తి సంగీత కచేరి నిర్వహించారు.
రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ ఎ.కోదండరామయ్య బృందం భక్తి సంగీతం, తిరుపతికి చెందిన శ్రీ రాజరాజేశ్వరి ఆర్ట్స్ అకాడమి బృందం నృత్య కార్యక్రమం నిర్వహించారు.