ఇటీవలే ఏపి ప్రభుత్వానికి జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన దేవులపల్లి అమర్కు క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాదు, ఢిల్లీ, హైదరాబాద్లలో కూడా దేవులపల్లి అమర్ తన కార్యాలయాలను ప్రారంభించేందుకు అనుమతి ఇస్తూ మరో జీవో జారీచేసింది. కాగా తెలంగాణకు చెందిన వ్యక్తికి సలహాదారుగా నియమించుకోవటమే కాకుండా భారీగా జీతభత్యాలతో పాటు కార్యాలయాల నిర్వహణ ప్రభుత్వంపై భారం కాదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.