తొలి ప్రైవేటు రైలు తేజాస్ను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు ప్రారంభించారు. వారంలో ఆరు రోజులపాటు ఈ రైలు లక్నో – ఢిల్లి మార్గంలో నడుస్తుంది. పాక్షిక – అత్యధిక వేగంతో నడిచే ఈ రైలును ఆవిష్కరించిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ రైల్వే శాఖలో ఆధునిక సాంకేతికతకు ఈ రైలు ప్రతీక అని అభివర్ణించారు. ఐఆర్సిటిసి చీఫ్ రీజనల్ మేనేజర్ అశ్విని శ్రీవాత్సవ మాట్లాడుతూ శనివారంనుంచి ప్రయాణీకులకు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.