బంగ్లాదేశ్లో ఉల్లిపాయల కొరత తీవ్రంగా ఉందని ఆ దేశపు ప్రధాని షేక్ హసీనా అన్నారు. మీరు ఉల్లిపాయల ఎగుమతి ఎందుకు ఆపేశారో నాకు తెలియదు అని ఆమె అన్నారు. ఇకపై భోజనంలో ఉల్లిపాయలు వాడవద్దని తమ వంటవాడికి చెప్పానని ఆమె అన్నారు. భారత్-బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో షేక్ హసీనా ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటామని ఆమె చెప్పారు.