దేశ రాజధాని ఢిల్లిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఢిల్లిలో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఐబీ హెచ్చరికలతో ఢిల్లి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్రవాదుల్లో ఇద్దరు పాక్కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ఢిల్లిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. రహదారులపై వెళుతున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.