ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రషర్ ఇండస్ట్రీని పూర్తిగా తమకే అప్పగించాలంటూ అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ తనను బెదిరించారంటూ శివరామిరెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.